మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (19:03 IST)

ఓ రాత్రి శ్మశానంలో బస చేయనున్న కర్ణాటక మంత్రి!

కర్ణాటక మంత్రి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల్లో మూఢ నమ్మకాలపై చైతన్యం కలిగించేందుకు ఆయన ఒక రోజు రాత్రి శ్మశానంలో నిద్రించాలని నిర్ణయించారు. ఆ మంత్రి పేరు సతీష్ జర్కిహోళి. ఎక్సైజ్ శాఖా మంత్రివర్యులు. 
 
గతంలో కర్ణాటకలో జేడీ (ఎస్) అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డి. కుమారస్వామి 'గ్రామాల్లో బస' కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఆ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అప్పట్లో ఇది బాగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి కాస్త అటూఇటూగా మార్చారు. 
 
ప్రజల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు. బెళగావి నగరంలో డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
దీనిపై మంత్రి మాట్లాడుతూ, తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు.