శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (09:32 IST)

స్వయంగా స్నానం చేయిస్తేనే పూజ ఫలిస్తుంది.. మహిళపై పూజారి రేప్

శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్

శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్లో అశాంతి నెలకొందని భావించి, స్థానికంగా ఉండే ఓ పూజారిని సంప్రదించాడు. దీంతో ఆ పూజారి ఇంటికి వచ్చి నలుదిక్కులు పరిశీలించాడు. ఇంట్లో శాంతి పూజ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆ యజమాని నమ్మాడు. 
 
అయితే, భర్తను, కుమారుడిని పూజ గదిలో కూర్చోబెట్టి గృహిణిని స్నానం చేసి రావాలని కోరాడు. తానే స్నానం చేయిస్తానని లేకపోతే పూజ ఫలించదని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆ మహిళను స్నాల గదిలోకి తీసుకెళ్లి... స్నానం చేయిస్తూ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో గట్టిగా ఆమె కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో పూజారి మహేష్‌ను పట్టుకున్న గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి రూ.5 లక్షల జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.