శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:01 IST)

అపోలోలో 'అమ్మ'ను చూసేందుకు నో... ఇప్పుడు 'అయ్య' కరుణను చూసేందుకు నో... అయ్యకు డ్రగ్ ఎలెర్జీ...

తమిళనాడు సీఎం జయలలిత అపోలోలో చికిత్స పొందుతూ ఆదివారం డిశ్చార్జ్ కానున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో.. తాజాగా డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి అనారోగ్యం పాలయ్యారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డ

తమిళనాడు సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె ఆదివారం డిశ్చార్జ్ కానున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో.. తాజాగా డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి అనారోగ్యం పాలయ్యారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డ్రగ్ అలెర్జీ కారణంగా కరుణానిధి ఆస్పత్రి పాలయ్యారని.. ఆయనను పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ ధ్రువీకరించింది.
 
కరుణానిధి అనారోగ్యం పాలయ్యారని.. తీసుకుంటున్న మందుల్లో తేడా కొట్టడంతో డ్రగ్ అలెర్జీకి దారితీసిందని.. డాక్టర్లు ఆయనను విశ్రాంతి తీసుకోమన్నారని.. ఇతరులను ఆయనను చూసేందుకు అనుమతించకూడదని సూచించినట్లు డీఎంకే అధిష్టానం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు ఏదో అయ్యిందని.. అందుకే వరుసబెట్టి ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరులో అమ్మ అపోలోలో చేరితే.. మధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అమ్మ డిశ్చార్జ్ అవుతారనే వార్తలు ప్రజల్లో సంతోషాన్ని నింపితే.. మరో రాజకీయ అగ్రనేత.. కరుణానిధి అనారోగ్యం పాలయ్యారు. 
 
అయితే కబాలి సందర్భంగా ఆస్పత్రి పాలైన రజనీ కాంత్ ఐదు రోజుల క్రితం వైద్య పరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లారు. ‘2.ఓ’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన హఠాత్తుగా అమెరికా వెళ్లడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గత జూన్‌లో ‘కబాలి’ షూటింగ్‌ పూర్తయిన తరువాత విశ్రాంతి కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్‌ కిడ్నీ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు రెండు నెలలపాటు అక్కడే ఉండి చికిత్సలు పొందారు. 
 
అనంతరం పూర్తిగా కోలుకొని చెన్నైకి చేరిన రజనీకాంత్ ఆపై రోబో ‘2.ఓ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గత ఆదివారం అపోలో ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ మళ్లీ అమెరికా వెళ్లారన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కిడ్నీ వ్యాధికి గతంలో తీసుకున్న చికిత్సలకు అనుసరించాల్సిన వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ కరుణానిధి కూడా అనారోగ్యం పాలవడం పార్టీ కార్యకర్తలు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఆందోళన తలెత్తేలా చేసింది.