శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (11:48 IST)

వామపక్ష నేత కూతురి పెళ్లి.. మెడలో ఎన్ని నగలో? ఫోటో వైరల్..

ప్రస్తుతం సెలెబ్రిటీలు వివాహాల కోసం భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. భారీ విలువ చేసే నగలు, వంటకాలు, దుస్తులు సర్వసాధారణమైపోయాయి. తాజాగా కేరళలో ఓ వామపక్ష నేత ఇంట్లో జరిగిన కుమార్తె పెళ్ళి అందరి దృష్టిని

ప్రస్తుతం సెలెబ్రిటీలు వివాహాల కోసం భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. భారీ విలువ చేసే నగలు, వంటకాలు, దుస్తులు సర్వసాధారణమైపోయాయి. తాజాగా కేరళలో ఓ వామపక్ష నేత ఇంట్లో జరిగిన కుమార్తె పెళ్ళి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ధరించిన నగలు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి గత ఆదివారం త్రిశూర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివాహంలో వధువు ధరించిన నగల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వామ్మో ఇన్ని బంగారు నగలా అని షాక్ తిన్నారు. దేశంలో రాజకీయ నాయకుల ఇంట్లో ఉండే బంగారం బయటకు తీస్తే.. భారత దేశంలో పేదరికమే ఉండదు అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 
దీనిపై  తన కుమార్తె పెళ్ళికి ధరించిన నగల విషయంపై సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ.. దక్షిణ భారత దేశం నగలకు, సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరన్నారు. అందుకే తన కుమార్తె పెళ్లికి నగలను చేయించానని సమర్థించున్నారు.