గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:59 IST)

కేరళలో చేతబడికి చట్టం తేనున్న సర్కార్!

కేరళలో చేతబడి నివారించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ చట్టం తేనుంది. ఇటీవలి కాలంలో కేరళలో నరబలులు పెరిగిపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకూ చేతబడి, తాంత్రిక పూజల కేసులు పెరిగిపోతుండటంతో, వీటిని ఆపేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ఈ దిశగా ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని రాష్ట్ర హోంమంత్రి రమేష్ తన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే తరహా బిల్లును మహారాష్ట్ర ప్రవేశపెట్టడంతో దాన్ని పరిశీలించాలని రమేష్ కోరారు.