శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (17:49 IST)

పెళ్లి చేయలేదని బ్రోకర్‌ని చంపేశాడు.. బాయ్‌ఫ్రెండ్స్‌తో పారిపోయి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య..

మంచి అమ్మాయితో పెళ్లి చేయలేదని మధ్యవర్తిగా నిలిచిన వ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కొత్తపల్లి మండలంలోని లింగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, మంచి అమ్మాయి కోసం వెతుక

మంచి అమ్మాయితో పెళ్లి చేయలేదని మధ్యవర్తిగా నిలిచిన వ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కొత్తపల్లి మండలంలోని లింగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పిన మధ్యవర్తిపై ప్రసాద్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గోపన్న అనే మధ్యవర్తి చాలాకాలంగా సంబంధాలు చూస్తున్నానని విసిగిస్తూ.. డబ్బు లాక్కునే వాడని.. అయితే అమ్మాయిని మాత్రం చూపించకపోవడంతో కోపంతో ఈ పని చేశాడని తెలిసింది. రోకలి బండతో గోపన్న తలపై మోదడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రేమికుడితో కలిసి ఇంటి వదలి వెళ్ళిపోయింది. ఇంతలో ఏం జరిగిందో కానీ రైలు పట్టాలపై ఓ 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రోహతక్‌లో చోటుచేసుకుంది. రోహతక్‌లో పదో తరగతి చదువుతున్న అమ్మాయి స్కూలుకు వెళ్తున్నానని చెప్పి.. గత ఏడాది 2016 డిసెంబర్ 11న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

అందుకే తిరిగి ఇంటికి చేరుకోలేనని.. తల్లిదండ్రుల ముఖం ఎలా చూడగలనని మదనపడి.. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. తన మరణంలో తన స్నేహితులకు కానీ, బాయ్ ఫ్రెండ్స్‌కు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి బాయ్ ఫ్రెండే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.