శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:39 IST)

లాన్స్ నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు పూర్తి.. అధికారిక లాంఛనాలతో...

భారత వీర జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో శుక్రవారం పూర్తయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని స్వగ్రామంలో జరిగిన అంతిమ యాత్రంకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం హనుమంతప్ప భౌతికకాయాన్ని హుబ్లీలో ఉంచారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 
 
పార్థివ దేహాన్ని ఉంచిన హుబ్లీ నెహ్రూ స్టేడియం జనంతో నిండిపోయింది. నివాళులర్పించేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సైనికులు, పోలీస్‌ అధికారులు వచ్చారు. హనుమంతప్ప అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఆరు రోజుల పాటు హనుమంతప్ప సియాచిన్‌ మంచు కొండల్లో సజీవంగా ఉన్నారు. ఆయనను బయటకు తీసిన సైనికులు ఢిల్లీలోని ఆర్మీ ఆప్పత్రిలో చికిత్స అందించారు. చివరికి మనుమంతప్ప గురువారం ఉదయం 11-45 గంటలకు మృతిచెందారు. 
 
మరోవైపు.. అమర జవాను హనుమంతప్ప కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రకటించారు. అలాగే, సియాచిన్‌ మంచు కొండల్లో ప్రాణాలు వదిలిన ముగ్గురు కన్నడ జవాన్ల కుటుంబాలకు తగిన సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హనుమంతప్ప పార్ధీవ దేహాన్ని హుబ్లీ వద్ద ఆయన స్వగ్రామానికి తరలించారు. సీఎం సిద్ద రామయ్య అక్కడకు చేరుకుని హనుమంతప్ప కుటుంబాన్ని ఓదార్చారు. ప్రజలంతా అమరజవాను భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.