గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:35 IST)

కాగుతున్న నూనెలో చిన్నారుల చేతులు పెట్టించాడు... ఎందుకో తెలుసా?

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపిం

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఐదుగురు చిన్నారులు కాగుతున్న నూనెలో చేతులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నార్సింగ్‌పాద అనే మారుమాల గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన చంగన్‌లాల్ అనే వ్యక్తి కుమారుడి ఫోన్ చోరీకి గురైంది. తన కుమారుడి ఫోన్ ఎవరు తీశారో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి తన వద్ద పని చేసే చిన్నారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వేడినూనెలో చేతులు కాలకపోతే నిజాయితీపరులని, కాలితే దొంగలని చెప్పాడు. 
 
ఆ తర్వాత మరుగుతున్న నూనెలో ఐదుగురు చిన్నారులతో చంగన్‌లాల్ చేతులు పెట్టించాడు. దీంతో తీవ్రగాయాలైన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో చంగన్‌లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.