గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 7 మే 2018 (10:14 IST)

మధ్యప్రదేశ్‌లో కోచింగ్ సెంటర్ అలా చేశాడు.. ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి?

యువతులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో ఓ కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడి.. అమ్మాయిల చేతిలో తన్నులు త

యువతులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో ఓ కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడి.. అమ్మాయిల చేతిలో తన్నులు తిన్నాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని  భిండ్‌ ప్రాంతంలో అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ఓ యువకుడు వచ్చాడు. 
 
రాగానే సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ప్యాంటూ విప్పి వికృత చర్యలకు పాల్పడ్డాడు. మొదట్లో అమ్మాయిలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మరుసటి రోజూ అదే తంతు సాగింది. దీంతో విసుగుచెందిన అమ్మాయిలు అతనికి స్థానికుల సాయంతో తగిన బుద్ధి చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి వికృత చేష్టలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్‌లోని పాటియాలాలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ప్రొఫెసర్ వేధించాడు. సహ విద్యార్థినులతో కలిసి ఆ ప్రొఫెసర్‌కు విద్యార్థిని తగిన బుద్ధి చెప్పింది.