శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (15:10 IST)

చిల్లరపోసి హోండా మోటార్ బైక్ కొన్నాడు.. బస్తాల్లో డబ్బు తెచ్చాడు...

పండుగ సీజన్‌లో వివిధ కంపెనీలు, గృహవస్తు ఉత్పత్తి సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. దీంతో పండగ సీజన్‌లో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. 
 
అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూడా తనకు ఇష్టమైన మోటార్ బైకును కొనుగోలు చేయాలని భావించాడు. అయితే, ఇందులో కొత్తేమంది అనే కదా మీ సందేహం. నిజమే... మోటర్ బైకుకు అయ్యే మొత్తం డబ్బులను బస్తాల్లో తీసుకొచ్చాడు. అదీ కూడా చిల్లర రూపంలో. ఈ డబ్బులను చూసిన మోటార్ బైకు డీలర్ విస్తుబోయాడు. పైగా, ఆ నాణేలను లెక్కబెట్టేందుకు ఏకంగా మూడు గంటల సమయం పట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ గుప్తాకు కూడా ఓ వస్తువు కొనాలని అనిపించింది. హోండా కంపెనీకి చెందిన యాక్టివా టూ వీలర్‌ను కొనాలని భావించాడు. కానీ, బైక్‌ను కొనేందుకు బస్తాల్లో డబ్బులు తీసుకెళ్లాడు. 
 
బైక్ ఖరీదు రూ.83 వేలు. ఇందులో వింతేమీ లేదు. కానీ, రాకేశ్ మాత్రం కేవలం రూ.5, రూ.10 నాణాలను బస్తాల్లో తీసుకెళ్లి, మొత్తం రూ.83 వేలు చెల్లించడంతోనే షోరూమ్ నిర్వాహకులు అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది, వాటిని లెక్కగట్టారు. రాకేశ్ ఎన్నేళ్ల నుంచి వీటిని సేకరించి పెట్టుకున్నాడో తెలియదుగానీ, ఇప్పుడీ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.