గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (10:16 IST)

అమ్మాయిలతో వ్యభిచారం.. వాడేసిన కండోమ్స్‌తో బ్లాక్‌మెయిల్.. ఎక్కడ?

తాము ఇంజనీరింగ్ విద్యార్థినులమని చెప్పి కొందరు అమ్మాయిలు గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంతేనా విటులు వాడిన కండోమ్స్‌తో అనేక మంది ధనవంతుల పిల్లలను బ్లాక్‌మె

తాము ఇంజనీరింగ్ విద్యార్థినులమని చెప్పి కొందరు అమ్మాయిలు గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంతేనా విటులు వాడిన కండోమ్స్‌తో అనేక మంది ధనవంతుల పిల్లలను బ్లాక్‌మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బుగుంజారు. ఈ తంతు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతంలో కొందరు అమ్మాయిలు కలిసి ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. తాము ఇంజనీరింగ్ చదివే విద్యార్థులమని చెప్పడంతో ఇంటి యజమాని కూడా నమ్మారు. అయితే, వీరివద్దకూ తరచుగా దిలీప్ గోయల్, అర్జున్ పాల్‌ అనే అద్దరు యువకులు వచ్చి వెళ్లేవారు. దీనిపై పోలీసులకు సమాచారం వెళ్లింది. 
 
దీంత పోలీసులు మఫ్టీలో సోదాలు నిర్వహించి వ్యభిచారం చేస్తుండగా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఫ్లాట్‌లో ఉండే అమ్మాయిలతో పాటు.. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అమ్మాయిలను రప్పించి విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంచి గుట్టుచప్పుడుకాకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు చేసి వ్యభిచారం దందా నడిపిస్తున్నట్టు గుర్తించారు. 
 
పైగా, దిలీప్ గోయల్ అనే వ్యక్తి రాజస్థాన్ రైఫిల్స్‌లో పనిచేసిన ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు కనుగొన్నారు. రోజువారీగా అమ్మాయిలను విటుల వద్దకు పంపించి వారి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
అంతేకాకుండా, విటులు వాడిన కండోమ్‌లను దాచి పెట్టి వాటిని ధనవంతులైన విటులకు చూపించి, బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి డబ్బు కూడా గుంజారు. ఈ ఫ్లాట్ నుంచి ఢిల్లీ, గ్వాలియర్, ముంబై నగరాలకు చెందిన 19 నుంచి 23 ఏళ్ల వయసుగల అమ్మాయిలను అదుపులోకి తీసికుని వారిని ప్రభుత్వ మహిళా సదనానికి తరలించారు.