శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (11:44 IST)

మదార్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయ్: వసీమ్ రజా

అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల విద్యా బోధనాలయాలుగా ఉన్న మదార్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ తక్షణం నిషేధించాలని రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
వర్శిటీ హిస్టరీ విభాగంలో పనిచేస్తున్న వసీమ్ టీవీ చానళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ "మేము మదార్సాలను తొలగించాలని కోరుతున్నాం. అక్కడ విశృంఖల స్వలింగ సంపర్కం జరుగుతోంది. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల్లో మౌలానాల ప్రమేయం ఉంది" అని ఆరోపించారు. ముస్లిం యువత భవిష్యత్తు మారాలంటే దేశంలోని మదార్సాలను నిషేధించాలని రజా కోరారు. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.