శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (17:04 IST)

బ‌స్సులో మహిళకు ముద్దుపెట్టాడు.. ఆపై పరారైనాడు.. రేప్ చేశాడని బీజేపీ నేతపై ఫిర్యాదు?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. నేరాలకు పాల్పడే బీజేపీ నేతల సంఖ్య కూడా పెరిగిపోతోంది. మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత బ‌స్సులో ఓ మ‌హిళ‌కు ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం కెమెరా కంటికి చిక్క‌

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. నేరాలకు పాల్పడే బీజేపీ నేతల సంఖ్య కూడా పెరిగిపోతోంది. మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత బ‌స్సులో ఓ మ‌హిళ‌కు ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం కెమెరా కంటికి చిక్క‌డంతో ఆ నేత చిక్కుల్లో ప‌డ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడే ఇటీవ‌ల ఓ బ‌స్సులో అంద‌రితో క‌లిసి ప్ర‌యాణిస్తున్నాడు. గద్‌చిరోలీ జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలోకి బ‌స్సు రాగానే అందులోని ఓ మహిళకు ముద్దు పెట్టాడు. ఆ మహిళతో ఆతనికి ముందే పరిచయం ఉన్నట్లు సమాచారం. కానీ సదరు మహిళ మాత్రం రవీంద్ర బవన్‌థాడేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తాజా ఘ‌ట‌న అనంత‌రం ఆ మ‌హిళ స‌ద‌రు నేతపై కేసు పెట్టింది. అప్పటి నుంచి ర‌వీంద్ర క‌నిపించ‌కుండా పోయాడు. తనకు ర‌వీంద్ర‌ ఉద్యోగం ఇస్తానని చెప్పాడ‌ని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని.. తనపై అత్యాచారానికి పాల్పడ్డానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రవీంద్ర బవన్ థాడేపై అత్యాచారం కేసు నమోదైంది. బస్సులోని సీసీటీవీ వీడియోలో రవీంద్ర బవన్‌థాడే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను ముద్దుపెట్టుకున్నట్లుంది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.