గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (12:28 IST)

భర్తను ఇరికించాలని ఇరుక్కుంది... ప్రియుడు కోసం స్నేహితురాలిని హత్య చేసిన మహిళ

భర్తను ఇరికించాలని భావంచిన ఓ వివాహిత చివరకు తాను చిక్కుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తోంది. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితోనే ఉండిపోవాలని భావించింది. ఇందుకోసం తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా భర్తను నమ్మించేందుకు ఓ ప్లాన్ వేసింది. ప్రియుడు సాయంతో తన స్నేహితురాలిని హత్య చేసింది. ఆ శవం పక్కన... తన భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ యువతి ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టి, ప్రియుడుతో లేచిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అది హత్యగా ప్రాథమిక నిర్ధారించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కంత్రీ వివాహితను అరెస్టు చేశారు. 
 
ఈ దారుణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఔరంగాబాద్‌కు చెందిన సోనాలీ షిండే (30) అనే వివాహితకు అదే ప్రాంతానికి చెందిన చబ్బాదాస్ వైష్ణవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను వీడి ప్రియుడుతోనే ఉండిపోవాలని భావించింది. ఇందుకోసం ఓ పథకం వేసింది. 
 
ప్రియుడు వైష్ణవ్‌తో కలిసి తన స్నేహితురాలు రుక్మన్ బాయీ మాలీని హత్య చేసింది. ఆపై మృతదేహంపై ఉన్న దుస్తులను తీసేసి, తన దుస్తులు, చెప్పులు తొడిగింది. తన ఆభరణాలను ధరింపచేసింది. తన మృతికి భర్తే కారణమని, నిత్యమూ మద్యం తాగొచ్చి కొడుతుంటాడని రాసి, మృతదేహం పక్కనే సూసైడ్ నోట్ పడేసి వెళ్లింది. 
 
అయితే, ఆ స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... మృతదేహాన్ని చూసిన తర్వాత హత్యగా అనుమానించి విచారించగా, సోనాలీ కుట్ర బయటకు వచ్చింది. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.