శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (11:34 IST)

గణేశుడు పాలు తాగుతున్నాడంటారు... గాంధీజీ బీఫ్ బ్యాన్ వ్యతిరేకి... అఖిలేష్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భాజపాపై మండిపడ్డారు. భాజపా బీఫ్ బ్యాన్ వ్యవహారాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకుంటోందని విమర్శించారు. గాంధీజీ బీఫ్ బ్యాన్‌కు వ్యతిరేకి అని చెప్పుకొచ్చారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ... ఆయన ప్రపంచమంతా చుట్టివస్తున్నారు. అక్కడి ప్రజలు ఏమేమి తింటున్నారో... ఏమి తాగుతున్నారో ఆయనకు తెలియదా...? దాని గురించి అక్కడే చెప్పవచ్చు కదా. భారతదేశ ప్రజలను భాజపా తన వైఖరితో కన్ఫ్యూజ్ చేస్తోందంటూ మండిపడ్డారు.
 
గతంలో అకస్మాత్తుగా గణేషుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటూ వదంతులు పుట్టించింది వీరు కాదా... ఇలాంటి మతసంబంధమైన విషయాలను తమ పబ్బం గడుపుకునేందుకు భాజపా వెలికి తెస్తుందనీ, ఎన్నికలు ముగిసేవరకూ దాన్ని రాజేస్తూనే ఉంటుందని విమర్శించారు.