శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (13:24 IST)

పుట్టింటికెళ్లిన భార్య తిరిగిరాలేదనీ.. దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన భర్త!

తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం ఆ భర్త అత్తారింటి చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ.. భార్య మాత్రం కనికికరం చూపలేదు.

తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం ఆ భర్త అత్తారింటి చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ.. భార్య మాత్రం కనికికరం చూపలేదు. దీంతో ఏం చేయాలో తోచని ఆ భర్త... తన భార్య మనసు కరిగి ఇంటికి వచ్చేలా చూడమని దేవుడిని ప్రార్థించసాగాడు. అప్పటికీ ఫలితం లేకపోవడంతో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఇండోర్‌లోని పల్డాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పల్డా ప్రాంతానికి చెందిన మనోజ్ బంజారా (37) అనే వ్యక్తి తన భార్యతో నాలుగు నెలల క్రితం గొడవ పడ్డాడు. దీంతో భర్తపై అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగు నెలల నుంచి భార్యను తన ఇంటికి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాడు.
 
ఇక చేసేదేంలేక... తన భార్య ఇంటికి వచ్చేలా చూడాలని మనోజ్ ప్రతి రోజు దేవుడిని ప్రార్థిస్తూ వచ్చాడు. కొద్ది రోజుల నుంచి దేవుడిని ప్రార్థించినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆవేశానికిలోనైన మనోజ్ దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ కేసులో మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.