శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (23:13 IST)

ఆస్తుల గొడవ.. సోదరుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి స్నేహితులతో?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా వయోబేధాలు లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వరుసకు చిన్నాన్న పగతో సోదరుడి కుమార్తెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. 
 
స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్తుల గొడవలో సొంత సోదరుడి కుమార్తె పైనే అత్యాచారం చేయించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బాధిత బాలిక వయస్సు 15 సంవత్సరాలు. కెదువా గ్రామానికి చెందిన చెనారామ్ అనే వ్యక్తి బాలికను తన సోదరుడి మీద పగతో కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను నాలుగు రోజులపాటు ఆమెను తీవ్రంగా హింసించాడు. దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది. తనను తన తండ్రి వద్ద వదిలేయాలని బాలిక బ్రతిమిలాడింది. సరేనన్న చెనారామ్‌.. ఆమెను బైక్‌పై పై ఎక్కించుకుని బాలిక గ్రామానికి బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో తన స్నేహితులను పిలిపించి, ఓ చెరువు వద్ద ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక తండ్రికి ఈ విషయం తెలియడంతో అతను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ నేరాన్ని అంగీకరించారు. దీనికి సహకరించిన చెనారామ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.