గోవాలో దారుణం : మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం.. కామాంధుడి అరెస్టు
గోవాలో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన 20 యేళ్ళ యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ కేసులో గోవాకు చెందిన ఇద్దరు యువకులను పనాజీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాకు చెందిన 20 యేళ్ళ యువతి తన స్నేహితుడితో కలిసి గోవాకు వచ్చింది. పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరస్వాడో అనే ప్రాంతానికి చెందిన హనీఫ్ మొహమ్మద్ (25) అనే వ్యక్తి ఇంట్లో బసచేసింది. ఆ తర్వాత హనీఫ్ మత్తుమందు కలిపిన డ్రింక్ ఇవ్వడంతో దాన్ని సేవించింది. ఆపై హనీఫ్, మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు.
శనివారం రాత్రి ఈ సంఘటన జరుగగా, ఆదివారం ఉదయం ఆ యువతి నోటి నుంచి నురుగు రావడంతో మపుసా టౌన్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి.. మత్తుమందు ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల నోటి నుంచి నురుగు వచ్చిందని, అలాగే, అత్యాచారం కూడా జరిగినట్టు వైద్యులు తమ పరీక్షల్లో తేల్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. హనీఫ్ను అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.