శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (11:18 IST)

బతుకుతుందనే ఆశతో ఆర్నెల్లుగా తల్లి మృతదేహానికి పూజలు... ఎక్కడ?

అతనికి తల్లి అంటే పంచ ప్రాణాలు. ఆమె కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేందుకు ఏమాత్రం వెనుకాడడు. అలాంటి తల్లే తనను విడిచి వెళ్లిపోయింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ యువకుడు.. తన తల్లి మళ

అతనికి తల్లి అంటే పంచ ప్రాణాలు. ఆమె కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేందుకు ఏమాత్రం వెనుకాడడు. అలాంటి తల్లే తనను విడిచి వెళ్లిపోయింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ యువకుడు.. తన తల్లి మళ్లీ బతుకుతుందన్న ఆశతో తల్లి మృతదేహానికి ఆర్నెల్లుగా ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని విశ్వంపూర్ సమీపంలోని రామ్‌నగర్ గ్రామంలో శోభ్‌నాథ్‌ గోండ్, అతని భార్య కాళేశ్వరి, వీరి కుమారుడు అమెరికన్‌ సింగ్‌లు కలిసి ఉంటున్నారు. గత ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా కాళేశ్వరి మృతిచెందింది. అమెరికన్‌ సింగ్ తన తల్లి కాళేశ్వరికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేదు. పైగా తల్లి మృత దేహాన్నిఇంట్లోనే మంచం మీద ఉంచి ప్రతీరోజూ తాంత్రిక పూజలు చేస్తూ వచ్చాడు.
 
ఇలా ఆరు నెలల సమయం దాటిపోయింది. ఆ మృతదేహం అస్థిపంజరంలా మారిపోయింది. ఈ విషయం బయటకు లీకైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
తన తల్లి నిత్యం తనతో మాట్లాడుతూ ఉందనీ, తన తల్లి తిరిగి బతికి వస్తుందని, తన పూజలకు తండ్రి కూడా సహకరిస్తున్నాడని తెలిపాడు. గత ఆరు నెలలుగా ఇంట్లోకి  ఏ ఒక్కరినీ వీరు అడుగుపెట్టనీయలేదు.