గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (14:28 IST)

మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి మాణిక్ రావ్ ఠాక్రే రాజీనామా!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రే ఆదివారం ముంబైలో ప్రకటించారు. తన రాజీనామా లేఖను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు ఆయన తెలిపారు. 
 
ఆదివారం వెల్లడైన ఆ రాష్ట్ర ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది లేదని ఎన్సీపీ తెగేసి చెప్పింది. అలాగే బీజేపీ, శివసేన కూడా తమ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. 
 
దీంతో ఈ ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. బీజేపీ మాత్రం దూసుకుపోతు ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానాన్ని శివసేన ఆక్రమించింది. మూడో స్థానాన్ని కాంగ్రెస్, ఎన్సీపీలు నిలిచాయి.