రాజధానిలో కొనసాగుతున్న మణిపూర్ విద్యార్థుల హత్యలు
భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న దాడులు, హత్యా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది.
మణిపూర్కి చెందిన జింగ్రామ్ కెన్గో (33)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ హత్య సమాచారాన్ని పోలీసులు జింగ్రామ్ కుటుంబసభ్యులకు అందించారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పీహెచ్డీ చేయడానికి జింగ్రామ్ నెలరోజుల క్రితం మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అయితే జింగ్ రామ్ గుర్తు తెలియని వారిచే హత్యకు గురైయ్యాడు.