శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (13:05 IST)

472 మంది మావోయిస్టులు లొంగిపోయారు : కేంద్ర హోంశాఖ!

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి 472 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గతేడాది 283 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగిందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 2014లోనే అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారని వెల్లడించింది. 
 
మావోల లొంగుబాటలో ఛత్తీస్‌గఢ్ తొలి స్థానంలో నిలుస్తున్నప్పటికీ, అక్కడే మావో కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయని కూడా పేర్కొంది. అంతేకాక ఈ యేడాదిలోనే ఆ రాష్ట్ర పోలీసులు అత్యధిక సంఖ్యలో 387 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ యేడాది అక్టోబర్ దాకా 76 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది మొత్తంలో ఈ సంఖ్య 82గా నమోదైంది.