శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

అమెరికాలో కమ్మ-కాపు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ కాదా?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.. మూడు రోజుల క్రితం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 
 
అమెరికాలో కొద్దిరోజుల క్రితం రెడ్డి టీమ్- కమ్మ టీమ్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, కాసేపు ఆట బాగానే జరిగింది. అయితే ఏదో చిన్న విషయం కారణంగా ఘర్షణ చోటుచేసుకుందని కట్జూ అన్నారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ రద్దు చేసుకొని వెళ్లిపోయారని పేర్కొన్నారు.
 
13,500 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కూడా వారు తమ కులం గురించి మాట్లాడుకుంటున్నారని కట్జూ పేర్కొన్నారు. తాను గతంలో 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ అని చెప్పానని, అది కరెక్ట్ అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమెరికాకు వెళ్లి కులం గురించి మాట్లాడుకోవడం విని షాక్ అయ్యాయని కట్జూ అన్నారు. ఓ అగ్రరాజ్యంలో నివసిస్తూ ఇంకా కులమే ప్రధానమైందా అని తిట్టిపోశారు.