శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (15:38 IST)

ఆడపడుచు భర్తతో కొత్త పెళ్లి కూమార్తెను రేప్ చేయించిన భర్త!

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలు మరింతగా పెరిగిపోతున్నాయి. కొత్త పెళ్లి కూతురు సొంత ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. ఈ ఘోరం ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. కొత్తగా వివాహమై ఇంటికి వచ్చిన పెళ్లి కుమార్తెపై ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీ కూడా కొత్త పెళ్లి కుమార్తె ఇంట్లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారానికి కట్టుకున్న భర్త కూడా సహకరించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఘజియాబాద్‌లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఇటీవలే వివాహమైంది. పెళ్లి తర్వాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్ నగర్‌లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు. 
 
అయితే, బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో రేష్మా భర్త షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు.