గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (11:20 IST)

మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం... లేదంటే చనిపోతాం : ఇద్దరు యువతులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు ఒకే కులానికి చెందిన అమ్మాయిలు చాలా కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తీవ్రంగా మందలించారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. 
 
తామిద్దరం పెళ్లి చేసుకుంటామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని వారు పోలీసులకు తెగేసి చెప్పారు. అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పోలీసులు పిలిపించి చర్చించారు. అయినప్పటికీ తమను వేరు చేయవద్దని వారు కోరుతున్నారు.