14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసు.. మేఘాలయ హోంమంత్రికి లింక్.. రాజీనామాకు డిమాండ్
ఇప్పటికే మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజ్భవన్ను అమ్మాయిల క్లబ్గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కోవడంతో తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14ఏళ్ల బాలికపై అత్యాచారాన
ఇప్పటికే మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజ్భవన్ను అమ్మాయిల క్లబ్గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కోవడంతో తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు మేఘాలయ హోంమంత్రి హోర్జు డోంకుపర్ రాయ్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
షిల్లాంగ్లోని మార్వలీన్స్ ఇన్పేరిట హోం మంత్రి తనయుడు ఓస్బర్ట్ రిమ్మీ ఓ గెస్ట్హౌస్ నిర్వహిస్తున్నారు. అందులో 14 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు వేర్వేరుగా అత్యాచారం చేశారు. వారిలో హోమంత్రి రాయ్ ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో డోంకుపర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాయ్ తేల్చి చెప్తున్నారు. అటువంటి తప్పు తాను చేయనని, ఆ గెస్ట్ హౌస్ను తాను నిర్వహించడం లేదని రాయ్ పేర్కొన్నారు. వాస్తవాలను వెలికి తీసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.