మినీ లారీ నుంచి రక్తం కారుతోంది.. తెరిచి చూస్తే డెడ్ బాడీ..
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో ఓ మినీలారీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురైనాడు. అయితే ఆతని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు తూత్తుక్కుడి జిల్లా సెయ్యదుంగానల్లూరు ప్రాంతాన
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో ఓ మినీలారీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురైనాడు. అయితే ఆతని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు తూత్తుక్కుడి జిల్లా సెయ్యదుంగానల్లూరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ (35) మినీ లారీ కొనుగోలు చేసి దాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య పేరు జెపశాంతి (27). వీరిద్దరికీ జయసర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఈ నేపథ్యంలో శనివారం సవారీకి రావాల్సిందిగా వచ్చిన ఫోన్కాల్ను నమ్మి... మినీ లారీని తీసుకుని వెళ్ళాడు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో సెయ్యాదుంగానల్లూరుకు సమీపంలోని ఏటిగట్టున ఆగివున్న మినీ లారీ నుంచి రక్తం కారుతండటాన్ని అటుగా వెళుతున్నవారు గుర్తించి పోలీసులకు తెలిపారు. సెల్వకుమార్ తల నరికి హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.