బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (13:15 IST)

దాష్టీకం.. అక్కతో సహజీవనం చేశాడు.. చెల్లెలిని రేప్ చేశాడు.!

అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. విలువలు పతనమైపోతున్నాయి. తన అనైతిక చర్య కారణంగా ఆమె చెల్లి బలైపోయింది. రాజస్థాన్లోని జైపూర్ జిల్లా బసారి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. లీలారామ్ జాట్ అనే వ్యక్తి ఆహారధాన్యాల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. 
 
వివాహ బంధంపై నమ్మకం లేకో, లేక, అతడిపై ప్రేమో గానీ, అతడితో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ సహజీవనం చేస్తోంది. తన 13 ఏళ్ళ చెల్లెలి (13)ని కూడా తమతోనే ఉంచుకుంది. అక్కతో సహజీవనం చేస్తున్న లీలారామ్ ఆమె చెల్లెలిపై కన్నేశాడు. ఈనెల ఆరోతేదీన ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి దాష్టీకాన్ని పొరుగు మహిళ చూసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
లీలారామ్ ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా, బాలికను బయటకు కూడా వెళ్లనివ్వడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, ఐపీసీతో పాటు పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న లీలారామ్ కోసం గాలిస్తున్నారు.