గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (17:04 IST)

రాజస్థాన్‌లో దారుణం : బాలిక కిడ్నాప్.. రేప్.. ఆపై గొంతునులుమి చంపేశారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజధాని జైపూర్‌కు 340 కి.మీ దూరంలోని జలావర్‌ జిల్లాలో జరిగింది.
 
జలావర్ జిల్లాకు చెందిన ఓ బాలిక... ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఇంతలో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైందని.. అనంతరం గొంతునులిమి చంపేశారని శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు.