గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (16:10 IST)

వధువు కోసం వేచిచూసి రాకపోయే సరికి.. విందు భోజనం లాగించి..?

వధువు కోసం వేచిచూసి ఓ వరుడు విసిగిపోయాడు. అంతేగాకుండా రాత్రి విందు భోజనం మాత్రం తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడులోని ఆర్కాడుకు చెందిన సురేష్ (27)కు వేలూరుకు చెందిన ఓ అమ్మాయితో పెద్దలచే వివాహం కుదిరింది. పెళ్లికి ముందు రోజు రిసెప్షన్ కోసం వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఓ దేవాలయంలో వేచి చూశాడు. 
 
అయితే ఎంత సేపటికీ వధువు రాకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం అందుకోవాలనుకున్నారు. ఫోన్లోనూ వధువు ఇంట నుంచి సరైన సమాచారం రాకపోవడంతో వధువు ఇంటికే సురేష్ బంధువులు వెళ్లారు. అక్కడికెళ్లాకే 16 ఏళ్ల మైనర్ అమ్మాయితో సురేష్‌కు వివాహం నిశ్చయించారనే అసలు విషయం తెలిసింది. 
 
వధువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సామాజిక సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయడంతో.. ఆ శాఖకు చెందిన అధికారులు వధువు తల్లిదండ్రులను బంధువులను హెచ్చరించడంతో వివాహాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న వరుడు, ఆతడి కుటుంబీకులు విందు భోజనం లాగించి, తట్టా బుట్టా సర్దుకుని సొంతూరు వెళ్లిపోయాడు.