శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (14:01 IST)

మెట్రో రైలు జర్నీ: ప్యాసింజర్‌‌కు చెంపదెబ్బ.. స్టాలిన్‌కు కొత్త చిక్కు (వీడియో)

మెట్రో రైలులో ప్రయాణం డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్‌కు కొత్త వివాదం తెచ్చిపెట్టింది. చెన్నైలో ఇటీవల ప్రారంభించిన మెట్రో రైలులో స్టాలిన్‌ తన అనుచరులతో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టాలిన్ ఓ ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టినట్లు వీడియో ఫుటేజ్ ద్వారా తెలియవచ్చింది. రైలులో నిలుచుని ఉన్న స్టాలిన్ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించినట్టు వీడియో ఫుటేజీలో తేలింది. 
 
అయితే అతను పార్టీ కార్యకర్త అని, స్టాలిన్ పక్క నిలుచున్న అతన్ని అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అడిగినట్లు సమాచారం. ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. రైలులో కూర్చుని ఉన్న మహిళల పక్కన ఉన్న అతడిని వెళ్లిపోవాలని మాత్రమే అడిగినట్టు చెబుతోంది. ఇంకా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా మాత్రమే స్టాలిన్ సూచించారని.. ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా చేజేసుకోలేదని డీఎంకే పేర్కొంది. ఇకపోతే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.