శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (17:06 IST)

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016'': డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌లకు చెక్.. అగ్రస్థానంలో మోడీ

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016''లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సత్తా చాటారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ రంగాల్లో ఐకాన్స్‌గా నిలిచిన కొ

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016''లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సత్తా చాటారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ రంగాల్లో ఐకాన్స్‌గా నిలిచిన కొంతమందిని ఎంపిక చేసి టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. ఈ పోల్‌లో అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లను వెనక్కి నెట్టి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందంజలో ఉన్నారు. మోదీ ఈ పోటీలో వుండడం వరసగా ఇది నాలుగోసారి. 
 
గత ఏడాది కాలంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ గతేడాది పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచారు. ఈ ఏడాది పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పోలింగ్‌లో ఇప్పటివరకు పోలైన ఓట్ల ప్రకారం ప్రధాని మోడీ 21శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే 10శాతం ఓట్లతో ఉన్నారు. ఒబామా 7 శాతం, పుతిన్‌, ట్రంప్‌ 6 శాతం ఓట్ల చొప్పున సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
డిసెంబరు 4వ తేదీతో ఈ పోల్‌ ముగుస్తుంది. ఐదు మిలియన్ల ఓట్లు పోల్‌ కాగా అందులో 16 శాతానికి పైగా ఓట్లతో 2014లో టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రీడర్స్‌ పోల్‌లో మోడీ తొలి స్థానంలో నిలిచారు.