బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సర్కారుకే ఓటు వేస్తా : రాంజెఠ్మలానీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఓటు వేస్తానని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు రాంజెఠ్మలానీ స్పష్టంచేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం పనీతీరు భేషుగ్గా ఉందని అందువల్ల ఆయన నేతృత్వంలోని సర్కారు మళ్లీ ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ జేడీయుకి ఓటు వేస్తానని ప్రకటించారు.
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత ప్రజలను మోసం చేసిన మోడీకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనన్నారు. బీహార్ ఎన్నికల్లో మోడీ ఓటమిని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
కాగా, జూన్ వరకూ మోడీ కోటరీలోనే ఉన్న రాంజఠ్మలానీ, తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉండాలని గట్టిగా పట్టుబట్టారు కూడా. చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా కేవీ చౌదరిని నియమించడంతో ఆయన బీజీపీకి దూరమయ్యారు.