గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 జూన్ 2017 (06:58 IST)

ప్రాజెక్టులు కడితేనే వర్షం వస్తుందా..ప్రధాని అంతమాటన్నారంటే ఏదో ఉంది మరి?

అది న్యూఢిల్లీ.. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంభాషణలో మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఎన

అది న్యూఢిల్లీ.. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంభాషణలో మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఎన్డీఏకి మద్దతిస్తున్న ముఖ్యమంత్రులతో పాటు సామాజిక విశ్లేషకులను కూడా విస్మయంలో ముంచెత్తింది. ఆలోచనలో కూడా పడేసింది. నీటి ప్రాజెక్టుల వెంట పడ్డారు కాబట్టే తెలంగాణలో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
 
‘‘రావు జీ... వర్షాలు బాగా పడుతున్నాయా’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో మోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంను ఆయన పలకరించారు. తెలంగాణలో వానలు బాగా పడుతున్నాయా అని ఆరా తీశారు. బాగానే పడుతున్నాయని సీఎం బదులిచ్చారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు కల్పించుకుని, ‘వాళ్లకు రెండేళ్లుగా బాగానే పడుతున్నాయి. మా ప్రాంతంలోనే వర్షపాతం తక్కువగా ఉంది’’అని అన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లను కూడా ఇదే అంశమై ప్రధాని పలకరించగా తమ రాష్ట్రాల్లో వర్షాలు ఆశించిన మేర లేవని చెప్పారు. ‘మీరు నీటి ప్రాజెక్టుల వెంటపడ్డారు . అందుకే వర్షాలు పడుతున్నట్టున్నాయి’అని కేసీఆర్‌తో ప్రధాని అన్నట్టు సమాచారం.
 
ప్రాజెక్టులపై సోకులు, మాటలు కాకుండా నిజమైన అవసరంతో, తపనతో ప్రయత్నాలు మొదలుపెడితే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న భావం మోదీ మాటల్లో ఉందా అని విశ్లేషకులు ఆలోచించుకుంటున్నారు.