శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:02 IST)

ప్రియురాలిని పార్కుకు తీసుకెళ్లి.. ఆ ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

ప్రేమ- బ్రేకప్ ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలా ప్రేమించి.. బ్రేకప్ చెప్పిన ఓ ప్రియురాలిని పబ్లిక్ పార్కులో కత్తితో బెదిరించాడు. ఓ ప్రేమోన్మాది. అంతేగాకుండా ఎలుకల మందు తినిపించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసు

ప్రేమ- బ్రేకప్ ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలా ప్రేమించి.. బ్రేకప్ చెప్పిన ఓ ప్రియురాలిని పబ్లిక్ పార్కులో కత్తితో బెదిరించాడు. ఓ ప్రేమోన్మాది. అంతేగాకుండా ఎలుకల మందు తినిపించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కుంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఐదేళ్ల పాటు ప్రేమాయణం జరిపించాడు. 
 
మనస్పర్థల కారణంగా వారిద్దరూ గత నెలలో బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ప్రేయసి దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన సోనవానే.. మాట్లాడాలని.. విఖ్రోలిలోని గార్డెన్‌కు రావాలని కోరాడు. మాజీ ప్రియుడి కోసం యువతి కూడా పార్కుకు వచ్చింది. అక్కడ సోనవానే మాట్లాడుతూ మాట్లాడుతూ.. కత్తితో బెదిరించాడు. ఇంకా ఎలుకల మందు తినిపించాడు. 
 
ఇక వేరు గత్యంతరం లేకుండా యువతి ఎలుకల మందును తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పార్కులోని సందర్శకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆపై చికిత్స తీసుకున్న యువతి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు కిషన్ సోనవానేను అరెస్ట్ చేశారు.