శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (14:10 IST)

ఐదు రోజులు రిహార్సల్... ఆ పై ఆత్మహత్య.. సూసైడ్ వీడియో లభ్యం...!

ముంబైలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరు ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించి, 5 రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఈ ఘటన జరుగగా, మృతులు తాము ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నదీ చెబుతూ, వీడియో రికార్డింగ్ ద్వారా స్పష్టం చేశారు. 
 
పోలీసుల కథనం ప్రకారం... ముంబైలోని పశ్చిమ అంధేరీ ప్రాంతానికి చెందిన అన్నాచెల్లెళ్లు భారతీ పాల్ (25), సోమనాథ్ కార్తిక్ పాల్ (20)లు వారి బాస్ ఇంట్లో, వాళ్ల అమ్మ షికా పాల్, పెంపుడు తండ్రి మనోజ్ అజిత్ కుమార్ పటేల్ లు లోఖండ్ వాలాలోని అపార్ట్ మెంట్ లో ఒకే తరహాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఆ ప్రాంతంలో భారతీ తను సూసైడ్‌కు గల కారణం తెలుపుతూ తీసిన వీడియో లభించింది. అందులో తన బాస్ టింకు సింగ్ పలు మార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగాను, అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. కార్తిక్ పాల్ కూడా ఇదే విషయం చెబుతూ, టింకూ తనను ఎన్నోసార్లు కొట్టాడని తెలిపాడు. 
 
ఈ ఆరోపణలపై టింకూను అదుపులోకి తీసుకొని విచారించగా, తొలుత ఆమె నాకు చెల్లితో సమానమని బుకాయించినా, ఆపై మాటమార్చి, ఆమెను ఇష్టపడ్డానని, ముద్దులు మినహా హద్దులు మీరలేదని తెలిపాడు. అదే విధంగా భారతి మృతదేహాన్ని శవపంచనామా రిపోర్టులో కూడా ఆమె అత్యాచారానికి గురికాలేదనే వచ్చింది. 
 
దీంతో అసలు వీరి ఆత్మహత్యకు కారణం ఏమిటన్న విషయంపై పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి ఫోన్ కాల్స్ ఆధారంగా ఏమైనా క్లూ చిక్కుకుందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.