శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (10:09 IST)

క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి

కేంద్ర మంత్రుల్లో మచ్చలేని వారిలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఒకరు. ఈయన తాజాగా తన క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించారు. తన క్లాస్‌మేట్ ఓ మోసగాడని తెలిసి అతనిపై కేసు పెట్టించిమరీ అరెస్టు చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరానికి చెందిన మాటుంగ ప్రాంత వ్యక్తి, జ్యోతి కుమార్ అగర్వాల్ (50) అనే వ్యక్తి పియూష్ గోయల్ స్కూల్‌మేట్. చిన్నప్పుడు వారిద్దరూ కలిసి చదువుకున్నారు. గత యేడాది సెప్టెంబరు నెలలో తన స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగగా, పియూష్ గోయల్ హాజరయ్యారు. అపుడు జ్యోతి కుమార్ తనను తాను పరిచయం చేసుకుని ఫోటోలు దిగాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలు చూపిస్తూ పలువురుని మోసం చేయసాగాడు. మనీష్ చగన్ లాల్ అనే వ్యక్తికి వాటిని చూపించి, పియూష్‌తో మాట్లాడి, రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. పియూష్‌కు దీపావళి కానుకను పంపుదామని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. 
 
ఆపై కాంట్రాక్ట్ మాటెత్తకపోవడంతో, తనకున్న పరిచయాలతో పియూష్‌ను మనీష్ సంప్రదించి, జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో జ్యోతికుమార్ మోసగాడని, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పియూష్ స్వయంగా ముంబై పోలీసులను ఆదేశించారు. దీంతో కదిలిన పోలీసులు, జ్యోతికుమార్ అగర్వాల్‌పై కేసు పెట్టి అరెస్టు చేయించాడు.