శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (13:20 IST)

17మంది మైనర్ బాలికలపై అత్యాచారం.. ఆ కామపిశాచిని?

దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సీరియల్ రేపిస్ట్. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక

దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సీరియల్ రేపిస్ట్. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17మంది మైనర్ బాలికలపై ఆ కామపిశాచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాయనగర్ వుడ్ ల్యాండ్ సొసైటీలో ఖురేషీ అనే ఈ మానవ మృగం నివాసం వుంటున్నాడు. ఇతడు బిల్డర్లకు భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తుంటాడు. ఈ సందర్భంగా నిర్మాణ భవంతుల వద్ద ఒంటరిగా వుండే బాలికలను వెతికి పట్టుకుంటాడు. వాళ్లను తండ్రి దగ్గరికి తీసుకెళ్తానని నమ్మబలికేవాడు. అలా తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఇలా నవీ ముంబై, థానే, థానే గ్రామీణం, పాల్ఘర్ జిల్లాల్లో 17 మంది చిన్నారులపై ఈ కామపిశాచి అత్యాచారం చేశాడు.
 
ఈ దారుణానికి పాల్పడేటప్పుడు తన లొకేషన్‌ను పోలీసులు గుర్తుపట్టకుండా ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసేవాడు. అయితే ఈ సీరియల్ రేపిస్ట్‌ గురించి కొందరు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఖురేషిని అరెస్ట్ చేశారు.