శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

చావు బతుకుల్లోనూ లైంగిక వేధింపులు... శవాలపై నగలు చోరీ

ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహ

ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహిళను అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకుపాల్పడ్డారు. ఆ తర్వాత తమదారిన తాము పోయారు. ఇది జరిగిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. అలాగే, చనిపోయిన శవాలపై నగలు చోరీ చేశారు. ఈ దారుణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ తొక్కిసలాటలో 23మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ తొక్కిసలాటలో చిక్కుకుని కొనఊపిరితో బయటపడిన బాధితులకు ఆపన్నహస్తం అందించేలా చేస్తుంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మృగాల్లా ప్రవర్తించారు. మహిళా క్షతగాత్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మరికొందరు దుర్మార్గులు చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 
 
ఈ దారుణ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఎల్ఫిన్‌స్టోన్‌ ఘటనకు కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.