శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:35 IST)

జయలలిత మృతిపై విచారణ చేసుకోమను... నాకేంటి భయం : శశికళ

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీరు సెల్వం జయ మృతిపై అనుమానాల

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీరు సెల్వం జయ మృతిపై అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. 
 
పైగా, అమ్మ మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీరు సెల్వం ప్రకటించారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసేందుకు ప్రయత్నించానని, కానీ శశికళ కలవనీయలేదని పన్నీరు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
ఈ వ్యాఖ్యలపై శశికళ స్పందించారు. పన్నీర్ చేసినవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేశారు. జయలలిత మృతికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో తాను భయపడాల్సిన పని లేదన్నారు. తన మీద వస్తున్న సందేహాలను ఆమె ఖండించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోదరిలా చూసుకున్నానని, ఆ విషయం తనకు తెలుసని శశికళ చెప్పారు. 
 
తనను ఎలా చూసుకున్నానో జయలలితకు బాగా తెలుసని ఆమె తెలిపారు. జయలలితను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నానని, ఆ విషయం ఆసుపత్రి సిబ్బందిని అడిగితే వివరంగా చెబుతారని శశికళ చెప్పారు. విచారణకు తాను భయపడాల్సిన పనిలేదని శశికళ తేల్చి చెప్పారు.