శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (14:02 IST)

ఢిల్లీ పోలీసు స్టేషన్‌ను ఊడ్చిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊడ్చారు. గురువారం ఉదయం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన పోలీసు అధికారుల్లో ఒక్కరు కూడా లేరు. 
 
దీంతో అవాక్కయిన ఆయన పోలీసులంతా ఎక్కడికెళ్లారని ఆరా తీస్తే, సమీపంలోని వాల్మీకి సదన్ వద్ద ప్రధాని పర్యటన బందోబస్తులో ఉన్నారని సమాధానమొచ్చింది. ఇక ఏం చేస్తారు. అదేసమయంలో స్టేషన్‌లో ఆయన కంటికి చెత్త కనిపించడంతో అక్కడే చీపురు పట్టిన ప్రధాని, పోలీస్ స్టేషన్‌ను ఊడ్చారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా వాల్మీకి సదన్‌కు వెళ్లి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛ్ భారత్‌ అభియాన్‌ను ఆయన ప్రారంభించారు.