శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:03 IST)

మౌంట్ ఎవరెస్ట్‌పైనే భూకంప ప్రభావం: 18 మంది పర్వాతారోహకుల దుర్మరణం!

మౌంట్ ఎవరెస్ట్‌పై భూకంప ప్రభావం పడింది. భూకంపం ధాటికి మంచు చరియలు విరిగిపడడంతో 18 మంది పర్వాతారోహకులు దుర్మరణం పాలయ్యారని నేపాల్ టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విదేశీయులతో పాటు నేపాలీ షెర్పాలు (గైడ్లు) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఎవరెస్టు బేస్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో, పర్వతారోహకులకు నేపాల్ సర్కారు హెచ్చరికలు జారీచేసింది. హిమాలయాలను వీడి వచ్చేయాలని సూచించింది. మంచు చరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.