శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (13:37 IST)

''తప్పకుండా విందుకు రావాలి'' అని పిలిచిన అల్లుడు.. తీరా వచ్చాక?

''తప్పకుండా విందుకు రావాలి'' అని ఇంటికి పిలిపించి.. పిల్లనిచ్చిన మామగారికి దారుణమైన శిక్ష వేశాడు.. ఓ అల్లుడు. ఉత్తరాఖండ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన రయీజ్ అహ్మద్ కుమార్తె రుక్షరుఖ్‌కు అదే ప్రాంతానికి ఇక్రమ్‌కు ఇటీవల వివాహం జరిగింది. అయితే వరకట్న వేధింపులతో రక్షరుఖ్ ఇబ్బందులు ఎదుర్కొంది. తండ్రితో ఈ విషయాన్ని రక్షరుక్ తెలియజేసింది.
 
దీంతో తన కుమార్తెకు మంచి జరగాలనే నెపంతో గ్రామ పంచాయతీతో రక్షరుఖ్ భర్త ఇక్రమ్‌తో కలిసి వేరు కాపురం పెట్టించాడు ఆమె తండ్రి. అయితే తన కుటుంబం నుంచి భార్యతో వేరుగా కాపురం వుండటం ఇక్రమ్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. 
 
దీంతో రక్షరుక్ తండ్రిపై పగ పెంచుకున్న ఇక్రమ్.. మామగారికి విందుకు రమ్మని ఆహ్వానించి దారుణానికి ఒడిగట్టాడు. విందు కోసం కుటుంబంతో కలిసి అల్లుడి ఇంటికి వచ్చిన మామగారికి ప్రాణాలు మిగల్లేదు. ఇంటికి వచ్చిన మామగారితో వరకట్నంపై మాటెత్తిన అల్లుడు ఆ వివాదం ముదిరడంతో.. మామగారిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక్రమ్‌ను అరెస్ట్ చేశారు.