గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2016 (11:40 IST)

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి... అమ్మాయిలపై నిషేధం విధించిన పుణె కాలేజ్

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి అంటూ... అమ్మాయిలపై నిషేధం విధించిందీ పూణెలోని ఓ కాలేజి. ఆ కాలేజీ పేరు బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కాలేజీలోని గ్రంథాలయం 24 గంటలూ తెరిచేవుంచుతారు.

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి అంటూ... అమ్మాయిలపై నిషేధం విధించిందీ పూణెలోని ఓ కాలేజి. ఆ కాలేజీ పేరు బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కాలేజీలోని గ్రంథాలయం 24 గంటలూ తెరిచేవుంచుతారు. దీంతో పీజీ వైద్యలు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్‌షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకునే వెసులుబాటు ఉంది. 
 
రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అమ్మాయిలపై నిషేధం విధిస్తూ, రాత్రి 11:15 గంటలకెల్లా అందరు విద్యార్థినులనూ హాస్టళ్లకు పంపేస్తున్నారు. యూజీసీ నిబంధనల మేరకు ఆడ, మగ తేడా చూపుతూ ఎలాంటి ఉత్తర్వులను ఇచ్చే వీల్లేకున్నా, మహిళల స్వేచ్ఛను హరించేలా కాలేజీ డీన్ అజయ్ చందన్ వాల్ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
 
కాగా, ఈ లైబ్రరీకి అర్థరాత్రి 1:30 గంటల సమయంలో కూడా చదువు పేరిట అమ్మాయిలు హాస్టల్స్ నుంచి బయటకు వస్తున్నారనీ, ఇది వారికి క్షేమం కాదన్న ఉద్దేశంతోనే నిబంధనలు మార్చామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం అమ్మాయిల భద్రత గురించి ఆందోళనతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని చందన్ వాలే చెబుతున్నారు.