గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (10:37 IST)

నిత్యానంద సెన్సేషనల్ కామెంట్స్: వాళ్లంతా రూ.300కి ఆశపడేవారే!

వివాదాస్పద నిత్యానంద స్వామి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారంతా రూ.300 కోసం ఆశపడేవారేనని విమర్శించి చిక్కుల్లో పడ్డారు. మూడు గంటల ఆందోళన కోసం ఆ మొత్తం తీసుకుంటున్నారే గానీ, వారికి తన పైన ఏమాత్రం కోపం లేదన్నారు. నిరసనలకు నేతృత్వం వహించే వారు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
 
తాను ఆశ్రమం లోపలే ఉన్నా, తన కోసం ఆందోళనకారులు బయట నిలబడి వేచి చూస్తుంటారని నిత్యానంద విమర్శించారు. మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఆయన భక్తులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కన్నడ సంఘాలు మరోసారి మండిపడుతున్నాయి. 
 
కాగా, నిత్యానందకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ కేసు విషయంలో నిత్యానందకు ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 6న నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.