శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (15:34 IST)

ఫిఫాతో అవిశ్వాస తీర్మానం.. మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా-శివసేన

లోక్‌సభలో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరల్ అయ్యింది. ప్రధానిని హగ్ చేసుకొని తాము

లోక్‌సభలో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరల్ అయ్యింది. ప్రధానిని హగ్ చేసుకొని తాము ప్రేమతో జయిస్తామని చెప్పే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ.. ఆపై కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ప్రధానిని రాహుల్ హగ్ చేసుకోవడంపై ముంబైలో పోస్టర్లు వెలిశాయి. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని శివసేన సరికొత్తగా అభివర్ణించింది. ఇటీవల ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో అవిశ్వాసాన్ని పోల్చింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాన్స్‌లా ఫైనల్లో విజయం సాధిస్తే.. రాహుల్ గాంధీ ఓడినా క్రొయేషియాలా దేశం మనసును గెలుచుకున్నారని పేర్కొంది. 
 
రాహుల్ గాంధీ ఆలింగనంపై స్పందిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఆయనలా చేసినట్టు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కొత్త అవతారంలో కనిపించిన రాహుల్‌ను అభినందించాలన్నారు. ''ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్ విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, క్రొయేషియా ఆడిన తీరు మాత్రం అద్భుతం. రాహుల్ కూడా అలాగే చేశారు. ఎందరో హృదయాలను గెలుచుకున్నారు" అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు.