గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: గురువారం, 29 జనవరి 2015 (20:42 IST)

నో మెనిఫెస్టో... ఓన్లీ విజన్ డాక్యుమెంటు : బీజేపీ

మెనిఫెస్టోలు... హామీలకు కాలం చెల్లిందని బిజేపీ చెప్పకనే చెప్పింది. ఢిల్లీ ఎన్నికలలో కొత్త పంథా పాటిస్తున్నట్లు తెలిపింది. హామీలు ఇవ్వడం వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శల కంటే విజన్ డాక్యుమెంటు చాలా ఉన్నతమైనదని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అందుకే ఈ ఎన్నికలలో తాము విజన్ డాక్యుమెంటరీకి వెళ్లుతున్నట్లు వివరించారు. 
 
ఆ విజన్ డాక్యుమెంట్ను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కలిసి విడుదల చేస్తారని పార్టీ నాయకులు చెప్పారు.బీజేపీ ఈసారి మేనిఫెస్టో విడుదల చేయదు. ప్రధానమంత్రి మోదీ, సీఎం అభ్యర్థి బేడీ కలిసి విజన్ డాక్యుమెంట్ మాత్రమే విడుదల చేస్తారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. 
 
ఈనెల 31, ఫిబ్రవరి 1, 3, 4 తేదీల్లో మోదీ నాలుగు ర్యాలీల్లో ప్రసంగిస్తారన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రతిరోజూ తమ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కు ఐదు ప్రశ్నలు వేస్తుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు 10న వెల్లడవుతాయి.