గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:50 IST)

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగ

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్‌సెల్వంకే మద్దతు తెలిపారు.

పన్నీర్ సెల్వమే తమిళనాడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. 'సీఎంవో తమిళనాడు' పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విట్టర్ ఖాతాలో వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 60వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాట రాజకీయ సమీకరణాలు గంట గంటకూ మారిపోతున్నాయి. ఇదంతా నడిపించేది.. శశికళ భర్త నటరాజన్ అందరూ భావిస్తారు. ఇంత హడావిడి నడుస్తుంటే నటరాజన్ మాత్రం కనబడట్లేదు. నిజానికి హైడ్రామా మధ్యన అన్నాడీఎంకే శాసనపక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. ఇంకా చెప్పాలంటే ఓవైపు శాసనపక్షనేతగా ఎన్నికైన రోజే ఆమె భర్త నటరాజన్ తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అమ్మ చికిత్స పొందిన ఆస్పత్రిలోనే నటరాజన్‌ను కూడా చేర్చారని విశ్వసనీయవర్గాల సమాచారం.