గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:42 IST)

అసోంలో బాంబు పేలుడు, ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు!

అసోం గోల్పారా జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గోల్పారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కృషినీ పోలీసు స్టేషన్‌ సమీపంలో బుధవారం ఉదయం 8.10 నిమిషాలకు ఈ పేలుడు సంభవించింది. 
 
తీవ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని ఓ సైకిల్కు అమర్చినట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని ముజిబార్ రెహ్మాన్గా పోలీసులు గుర్తించారు.