గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (20:50 IST)

ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ : జైరాం రమేష్

దేశ ప్రజల శ్రేయస్సును కోరే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో ప్రజాశ్రేయస్సే తప్ప రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
 
భూసేకరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 19న రైతులతో కలిసి ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. బిల్లు పాసైతే సమాజంలో చెడు ప్రభావం చూపుతుందన్నారు. అందుకే తాము భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వ నిర్ణయాలకు తాము మద్దతివ్వబోమన్నారు.